TG: మేడ్చల్ జిల్లా డబిల్పూర్ గ్రామంలో విషాదం నెలకొంది. చెరువులో స్నానానికి వెళ్లి ఉమన్(14), ఇర్ఫాన్(12) అనే ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వీరిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. మృతులు 9వ, 7వ తరగతి చదువుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.