TG: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో రౌడీషీటర్ హల్చల్ చేశాడు. మద్యం మత్తులో డబ్బుల కోసం ఇద్దరిని బెదిరించాడు. వారితో డబ్బులు లేవని చెప్పడంతో కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.