AP: ఈవీఎం గోదాము వద్ద హెడ్కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కాకినాడలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ ధనరాజు రైఫిల్తో కాల్చుకున్నాడు. ఈవీఎంల వద్ద విధుల్లో ఉండగానే రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ధనరాజును సిబ్బంది కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం ధనరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.