AP: విజయనగరం జిల్లాలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. మట్టి పెకిలించే సమయంలో నాటు బాంబు పేలింది. దీంతో బాంబులోని గాజుపెంకులు గుచ్చుకుని ముగ్గురు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెందుర్తిలోని సీహెచ్సీకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.