TG: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో దారుణం జరిగింది. కాట్నపల్లిలో మూడేళ్ల చిన్నారిని వీధికుక్కలు పీక్కుతిన్నాయి. దీంతో ఆ చిన్నారి మృతి చెందింది. ఇంటి ముందు ఆడుకుంటున్న దివ్యా బెహ్రాపై కుక్కలు దాడి చేశాయి. చిన్నారిని కుక్కలు నోటకరుచుకుని పొలాల్లోకి లాక్కెళ్లాయి. ఒడిశా నుంచి వచ్చి ఇటుకబట్టీల్లో చిన్నారి తల్లిదండ్రులు పనిచేస్తున్నారు.