TG: సంగారెడ్డి జిల్లా నందికంది గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ వైపు నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో డివైడర్ను ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.