TG: భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టును హైదరాబాద్లోని సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. దాదాపు రూ.2.29 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. 333 కిలోల గంజాయిని సీజ్ చేసి 126 మందిని అరెస్ట్ చేశారు. అలాగే రూ.25.82 లక్షల విలువైన హాష్ ఆయిల్ను, రూ.22.5 లక్షల విలువైన ఓపీఎం మిక్స్ పౌడర్ను పట్టుకున్నారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.