AP: విశాఖలో ఐటీ ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఉన్నతి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆఫీస్ ఏర్పాటు చేసి ఉద్యోగాలంటూ లక్షన్నర నుంచి రూ.3 లక్షల వరకు వసూళ్లు చేశారు. ఈ క్రమంలో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు.