NLR: నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆస్తి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. సొంత తమ్ముడు ఇంటిపై దౌర్జన్యం చేస్తున్నాడని ఓ మహిళ సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేస్తూ తనపై దాడికి యత్నిస్తున్నాడని ఆమె తెలిపింది. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.