NLR: మనుబోలు మండలం కొమ్మలపూడి-కొండూరు సత్రం గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటగిరి నుంచి నెల్లూరు బయల్దేరిన ఆర్టీసీ బస్సు, మార్గమధ్యంలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.