• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

రూ.64 లక్షల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత

TG: హైదరాబాదులో డ్రగ్ మాఫియా విస్తరిస్తోంది. దీంతో పోలీసులు నగర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా పెట్టారు. సనత్ నగర్, చిక్కడపల్లి, ఆదిభట్లలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ.64 లక్షలు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రధాన నిందితులను పట్టుకున్నారు. వీరు ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.

April 7, 2026 / 12:27 PM IST

విషాదం.. గుండెపోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి

TG: జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామంలో విషాదం నెలకొంది. చంద్రశేఖర్, నవిత ఏకైక కుమారుడు నిషాంత్ (9) గుండెపోటుతో మరణించాడు. శివాలయంలో అన్నదానం జరుగుతుండగా బాలుడు కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. 3వ తరగతి చదువుతున్న నిషాంత్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆ తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కన్నీరు పెట్టించాయి.

April 7, 2026 / 12:10 PM IST

కూకట్‌పల్లి JNTUకి బాంబు బెదిరింపు

TG: కూకట్‌పల్లి JNTUకి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. JNTU అధికారిక వెబ్‌సైట్‌కు ఆగంతకులు మెయిల్ పంపించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. విద్యార్థులను, ఉపాధ్యాయులను బయటకు పంపి అధికారులు తనిఖీలు చేపట్టారు.

April 7, 2026 / 11:20 AM IST

అధికారులమంటూ రూ.92 లక్షలు కాజేశారు!

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన డిజిటల్ అరెస్ట్ మోసం తాజాగా వెలుగు చూసింది. CBI, ED అధికారులమంటూ ఓ వృద్ధురాలికి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. డ్రగ్స్ కేసులో ఆమె పేరుందని, పాస్‌పోర్ట్ బ్లాక్ చేస్తామని బెదిరిస్తూ ఏకంగా రూ.92.7 లక్షలు కాజేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కర్ణాటకకు చెందిన లింగబలిజ విరూపాక్ష అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. 

April 7, 2026 / 10:36 AM IST

డ్రగ్స్.. ఇద్దరు మైనర్లు అరెస్ట్

AP: కృష్ణా జిల్లా పెనమలూరులో గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరి నుంచి మొత్తం 4 కిలోల గంజాయితో పాటు ఒక గ్రాము ఎండీఎమ్ఏ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇప్పటికే ఈ ఇద్దరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

April 7, 2026 / 10:07 AM IST

ఇంటిపై దాడి.. న్యాయవాది హత్య

AP: అన్నమయ్య జిల్లా కేవీపల్లి మం. వడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఎల్లయ్య అనే న్యాయవాది ఇంటిపై అర్ధరాత్రి బంధువులే రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఎల్లయ్య మరణించగా.. అతని తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు పీలేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాత  కక్షలే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

April 7, 2026 / 09:04 AM IST

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి కలకలం

TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి గంజాయి కలకలం సృష్టించింది. డ్రగ్స్ రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 14.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడి అదుపులోకి తీసుకుని ఎక్కడి నుంచి రవాణా చేస్తున్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

April 7, 2026 / 08:09 AM IST

BREAKING: అగ్నిప్రమాదం

TG: HYDలోని రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్కూట్ కారణంగా బట్టల షాపులో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 7, 2026 / 06:20 AM IST

భార్యను హతమార్చిన భర్త

TG: కట్టుకున్న భర్తే.. భార్యను హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చోటుచేసుకుంది. మార్చి 27న కవిత తన ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో మార్చి 30న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. జడ్చర్లలో ప్రియుడితో కలిసి ఉందని గుర్తించి.. ఆమెను తీసుకుని వచ్చేందుకు పోలీసులతో కలిసి వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో కారులోనే కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు.

April 6, 2026 / 04:11 PM IST

లారీ, కారు ఢీకొని.. ముగ్గురు మృతి

TG: ఖమ్మం జిల్లా కొనిజర్ల వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. తెల్లవారుజామున లారీ, కారు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. మృతులు రాజమహేంద్రవరానికి చెందిన వీర్రాజు, వీర శైలజగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 6, 2026 / 01:06 PM IST

దారుణం.. భార్యను హత్య చేసిన భర్త

TG: సంగారెడ్డి(D) జహీరాబాద్‌లో భర్త సిద్ధారెడ్డి భార్య కవితను హత్య చేశాడు. మార్చి 27న కవిత ప్రియుడితో వెళ్లిపోవడంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలించారు. జడ్చర్లలో ప్రియుడుతో ఉన్నట్లు గుర్తించి.. జహీరాబాద్ తీసుకొస్తుండగా పోలీసులతో వెళ్లిన భర్త మార్గమధ్యంలో భార్యను కత్తితో పొడిచాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 6, 2026 / 12:02 PM IST

కారు ప్రమాదం.. భార్యభర్తలు మృతి

AP: తూర్పు గోదావరి జిల్లాలో కారు పంట కాలువలోకి దూసుకెళ్లడంతో భార్యభర్తలు ప్రాణాలు కోల్పోయారు. మృతులను వెలగతోడుకు చెందిన భోగిల్లి సతీష్(40), కిరణ్మయి(36)గా గుర్తించారు. మండపేట మం. తాపేశ్వరం వద్ద ఈ ఘటన జరగ్గా.. గమనించిన స్థానికులు వెంటనే సతీష్ తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలను రక్షించారు. కాకినాడలో పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సతీష్ తల్లిదండ్రులు తెలిపారు.

April 6, 2026 / 11:50 AM IST

ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో కోట్లు కొట్టేసిన కిలాడీ!

TG: FBలో మహిళ పేరుతో వచ్చిన ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ HYDకు చెందిన వీరభద్రరావు అనే టెకీని నిండా ముంచేసింది. ఓ మహిళ ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో అధిక లాభాలంటూ ఆశ చూపగా.. నమ్మిన వీరభద్రరావు ఓ యాప్‌ ద్వారా గత SEP-DEC కాలంలో ఏకంగా రూ.2.36 కోట్లు పెట్టుబడి పెట్టాడు. చివరకు లాభాలు రాకపోగా, పెట్టిన డబ్బు కూడా వెనక్కి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

April 6, 2026 / 11:07 AM IST

గంగమ్మ జాతరలో ఘర్షణ.. వ్యక్తి మృతి

AP: కడప జిల్లా ఆలంఖాన్‌పల్లెలో అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ రేగింది. డీజే డాన్స్ దగ్గర ఈ గొడవ జరగ్గా.. మాటామాటా పెరిగి కత్తితో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పెద్ద దస్తగిరి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తిని రిమ్స్‌కు తరలించారు. అతనిపై ఆస్పత్రి ప్రాంగణంలోనూ దాడి జరగ్గా.. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 6, 2026 / 08:57 AM IST

రోడ్డు ప్రమాదం… పంచాయతీ ఉద్యోగి మృతి

KKD: తొండంగి మండలం రావికంపాడు వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం చెందాడు. మృతుడు ఎల్లయ్యపేట పంచాయతీ ఉద్యోగి ఎస్.సత్య వెంకటేష్ (30) గా గుర్తించారు. మృతుడు తన స్వగ్రామమైన అన్నవరం నుంచి వ్యక్తిగత పనులపై కత్తిపూడి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

April 5, 2026 / 08:08 PM IST