ATP: అనంతపురం వన్ టౌన్ పరిధిలోని శారద నగర్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ పి.జగదీశ్ ఆదేశాలతో వన్ టౌన్ సీఐ జి.వెంకటేశ్వర్లు శనివారం రాత్రి మెరుపు దాడి నిర్వహించారు. నిందితులు నరవుల రామమోహన్, షేక్ నూర్ మహమ్మద్ నుంచి రూ. 2 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.