RR: కేశంపేట మండలం వేములనర్వ గ్రామ శివారులోని వేణు గోపాల స్వామి గుట్టపై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత 2 రోజులుగా గుట్టపై జరుగుతున్న తవ్వకాలపై విస్తృత చర్చ జరుగుతున్న అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుట్టపై అక్రమ తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.