ADB: అర్హులైన ప్రజలందరూ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. గుడిహత్నూర్ మండలంలోని నేరడిగొండ తండాలో బుధవారం నిర్వహించిన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు.