KRNL: ప్రభుత్వం జారీ చేసిన GO 58 మేరకు డోన్ మున్సిపాలిటీలో ఇంటి పన్ను బకాయిల వడ్డీపై 50% రాయితీ ఇస్తున్నట్లు కమిషనర్ ప్రసాద్ గౌడ్ బుధవారం తెలిపారు. ఈ అవకాశం ఈ నెల 31 వరకు మాత్రమే ఉందన్నారు. రాయితీ పొందాలంటే బకాయిలను ఒకేసారి పూర్తిగా చెల్లించాలని పేర్కొన్నారు. ప్రజలు ఇంటి, నీటి, ఖాళీ స్థలాల పన్నులు వెంటనే చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ సూచించారు.