BHNG: రామన్నపేట మండలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచాలని మండల సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు ఆధ్వర్యంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.