SRCL: గంభీరావుపేట మండలం లింగన్నపేట, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, ముస్తాబాద్,0 పోతుగల్లులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ఆరోగ్య పథకాలను నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని సూచించారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలని వివరించారు.