SRPT: నడిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1974-75 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన మిత్రులు తమ సహచరుడు, దివంగత షేక్ మౌలానా కుటుంబానికి అండగా నిలిచారు. బుధవారం మౌలానా భార్యను పరామర్శించి, మానవతా దృక్పథంతో రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత మిత్రులంతా కలిసి ఈ సేవా కార్యక్రమం చేపట్టారు.