BHNG: తుర్కలషాపురంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 284 పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేసి, 48 పశువులకు గర్భకోశ వ్యాధి పరీక్షలు చేసి మందులు అందజేశారు. పశు వైద్యాధికారి డాక్టర్ యాకుబ్ మాట్లాడుతూ.. రైతులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.