MBNR: విద్యా రంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని PDSU జిల్లా అధ్యక్షుడు మారుతి విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నిరాశ మిగిల్చిందని మండిపడ్డారు. 1.39 లక్షల కోట్లు విడుదల చేయడం విడ్డూరంగా ఉందన్నారు.