NLG: శాలిగౌరారం మండలం అడ్లూరు శివారులో రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో తుర్కపల్లికి చెందిన తల్లికొడుకులు పార్వతమ్మ, నరసింహాకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటి రమేశ్, పైలెట్ యాదగిరి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.