KMM: మధిర రైతు వేదికలో బుధవారం వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రోటవేటర్లు, పవర్ స్ప్రేయర్లను పంపిణీ చేశారు. ఏడీఏ విజయచంద్ర మాట్లాడుతూ.. చిన్న రైతులకు 50 శాతం, పెద్ద రైతులకు 40 శాతం సబ్సిడీతో ఈ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతుల ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు పేర్కొన్నారు.