SDPT: తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్నకోడూరు మండలం అనంతసాగర్ ఉన్నత పాఠశాలలో బాలకవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 20 మంది విద్యార్థులు పాల్గొని తమ కవితలు వినిపించారు. అరవై సంవత్సరాల పేర్లు విద్యార్థులు చదివి వినిపించారు. అనంతరం తెలుగు ఉపాధ్యాయులు పర్షరాములు పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.