ప్రకాశం: యర్రగొండపాలెం ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులకు బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం కోసం ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎరిక్షన్ బాబు తెలిపారు.