NZB: మోపాల్ మండలం సిర్పూర్ శివారు అటవీ సమీపంలో చిరుత కూన సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గత వారం రోజుల్లో రెండు సార్లు చిరుత కూన వచ్చినట్లు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదైంది. ఈ విషయంపై ముదక్పల్లి సెక్షన్ అధికారి బాసిత్ మాట్లాడుతూ.. చిరుత కూన సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.