KNR: గంగాధర మండలం న్యాలకొండన్నపల్లి గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సరస్వతి దేవికి పూజ చేసి, ఉగాది పచ్చడిని పంచుకున్నారు. తెలుగు ఉగాది పండుగ విశిష్ఠత గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.