MBNR: స్నేహపూర్వక వాతావరణంలో మైనార్టీలు రంజాన్ పండుగను జరుపుకోవాలని మహబూబ్ నగర్ మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. బుధవారం కార్పొరేషన్ పరిధిలోని 37వ వార్డులో మైనార్టీలకు రంజాన్ సందర్భంగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు అండగా నిలుస్తుంది అన్నారు.