MDK: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్ డిమాండ్ చేశారు. కౌడిపల్లి మండల కేంద్రంలో బుధవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వికలాంగులకు రూ. 6000 పెన్షన్, మహిళలకు రూ.2500 పెన్షన్, వ్యవసాయ కూలీలకు రూ. 12000 అమలు చేయాలన్నారు.