SRPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ ఎస్పీ నరసింహ ఐపీఎస్ నెలవారీ సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా శాంతిభద్రతలు, మహిళా భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన పెంచాలని సిబ్బందిని ఆదేశించారు. అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.