కోనసీమ: వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయూతనిచ్చే MSMEలకు మద్దతునిస్తూ, బ్యాంకర్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. బుధవారం రావులపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రెవిన్యూ అధికారులతో కలిసి పాల్గొన్నారు. MSMEలు అభివృద్ధి చెందేలా బ్యాంకర్లు సహకారం అందించాలన్నారు.