HYD: హెచ్.ఎల్.ఏలో వెల్ఫేర్ ఫండ్ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఈ.డీ రామ్మోహనరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ఏడాది కూడా పరిశ్రమ అభివృద్ధికి ఉద్యోగులందరూ ఐకమత్యంతో కృషి చేయాలని ఆయన కోరారు. ఈ వేడుకల్లో జనరల్ మేనేజర్ సతీష్, కర్కా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.