KNR: చొప్పదండి నియోజకవర్గంలోని బస్ స్టేషన్ల అభివృద్ధితో పాటు కొత్త రూట్లలో బస్సులు నడిపించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రభాకర్కు చొప్పదండి ఎమ్మెల్యే సత్యం వినతిపత్రం అందజేశారు. మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు పెరుగుతుండడంతో నియోజకవర్గాల వారిగా మౌలిక సదుపాయాలు, కొత్త బస్సులు, బస్ స్టేషన్ల గురించి మంత్రి, అధికారులతో సమావేశం నిర్వహించారు.