MDK: సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16న ధర్నాలో పాల్గొన్న అంగన్వాడీలకు మెమో జారీచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. నర్సాపూర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.. అంగన్వాడి ఉద్యోగులకు ప్రభుత్వం మెమో జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.