CTR: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం తెలిపారు. కుప్పం మండలం గుట్టపల్లే వెటర్నరీ కేంద్రం వద్ద చాప్ కట్టర్లను రైతులకు బుధవారం పంపిణీ చేశారు. పాడి రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడతాయని వెల్లడించారు. రైతులకు రాయితీపై పలు పరికరాలను అందిస్తున్నామన్నారు.