SRPT: మున్సిపల్ కార్మికులకు చట్టప్రకారం ఆదివారం సెలవు ప్రకటించాలని BRTU జిల్లా గౌరవ అధ్యక్షులు వెంపటి గురూజీ డిమాండ్ చేశారు. సూర్యాపేటలో రైతుబజార్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వేతనాల పెంపు హామీని విస్మరించిందని మండిపడ్డారు. ఎండ తీవ్రత దృష్ట్యా వసతులు కల్పించాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని అధికారులను హెచ్చరించారు.