AP: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన టీడీపీ నాయకుల జంట హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గుండ్లపాడు జంట హత్యల కేసులో ఏ-6 నిందితుడిగా ఆయన ఉన్నారు. పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.