AP: వచ్చే ఏడాది ఉగాది తర్వాత 2 నెలల్లోనే పోలవరం పూర్తి చేస్తామని CM చంద్రబాబు తెలిపారు. గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. మిగిలిన పనుల కోసం మరో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందే నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయడంతో పాటు, యువతకు ఉపాధి కోసం నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు.