KNR: జమ్మికుంట మండలంలో దళితబంధు రెండో విడత నిధులను తక్షణమే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఎంపీడీవో పద్మకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన నిధుల జాప్యంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కార్యదర్శి చిలివేరు శ్రీకాంత్ పాల్గొన్నారు.