PLD: జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని విడనాడి మంచి పౌరులుగా జీవించాలని సూచించారు. వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని హెచ్చరించారు. పాత పద్ధతి మార్చుకోకుండా గొడవలకు, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.