విశాఖ పౌర గ్రంథాలయంలో బుధవారం జరిగిన AISF రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ విజయవంతమైంది. 11 యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొని సమస్యలపై చర్చించారు. ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, నిధులు, స్కాలర్షిప్స్ విడుదలపై డిమాండ్ చేశారు. నూతన కమిటీలో కన్వీనర్గా ఉల్లం నాగరాజు ఎన్నిక కాగా, కో-కన్వీనర్లుగా అంజలి, ఉమామహేష్, వెంకటేష్ ఎంపికయ్యారు.