GDWL: గద్వాలలోని గ్యాస్ ఏజెన్సీలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా బుధవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు. గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రెండు బుకింగ్ల మధ్య 45 రోజుల గడువు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల గడువు తప్పనిసరి అని తెలిపారు.