NLG: చిట్యాల మండలం వెలిమినేడులో భవన నిర్మాణ ప్రమాదంలో పశ్చిమ బెంగాల్కు చెందిన కూలీ నారాయణ చంద్ర రాయ్(43) మృతి చెందాడు. ఒక కంపెనీలో గోడ పని చేస్తూ 12 అడుగుల ఎత్తు నుంచి కింద పడటంతో తలకు ఇనుప రాడ్ గుచ్చుకుంది. నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడని ఎస్సై రవికుమార్ తెలిపారు. మృతుడి తండ్రి బిమల్ చంద్ర ఇవాళ ఫిర్యాదు చేశారు.