కరీంనగర్లోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా ‘స్టాటిక్ ఫోర్స్’తో భద్రత కల్పించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల నిఘాను పరిశీలించిన ఆయన, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని ఆదేశించారు.