WNP: అదుపుతప్పి కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటన పెబ్బేరు మండలం 44 జాతీయ రహదారిపై ఇవాళ చోటుచేసుకుంది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న SI యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాదంలో డ్రైవర్ కారు అద్దాలు పగలగొట్టి క్షేమంగా బయటకు వచ్చాడన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.