VZM: నూతన సంవత్సర ఉగాది ప్రతి ఇంట్లో సిరిసంపదలతో పాటు సుఖశాంతులు నింపాలని మంత్రి శ్రీనివాస్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ అని ఆయన తెలిపారు.