AKP: నక్కపల్లి మండలంలో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన తగ్గదని సీపీఎం జిల్లా కమిటీ తీర్మానించింది. బుధవారం అనకాపల్లి సీపీఎం కార్యాలయంలో పార్టీ సమావేశం జరిగింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కోసం సేకరించిన భూములకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలన్నారు.