SDPT: ముదిరాజుల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆరోపించారు. బుధవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డిలో ఇచ్చిన హామీ బీసీ డిక్లరేషన్ చేయకుండా ముదిరాజులను బీసీ ఏలో చేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.