JN: నియోజకవర్గంలో రోడ్ల పనులు దాదాపు రెండేళ్లుగా పూర్తిగా నిలిచిపోయాయని MLA డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. 131 గ్రామాలు, 2 పట్టణాలు, 42 వార్డులున్న నియోజకవర్గంలో బస్సుల సమస్య తీవ్రంగా ఉందని, రోజుకు కేవలం 2 ట్రిప్పులు మాత్రమే నడుస్తున్నాయని అన్నారు. వెంటనే రోడ్ల పనులు, బస్సుల సంఖ్య పెంచాలని కోరారు.