NZB: కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 23న జరిగే ‘చలో సెంట్రల్ లేబర్ కమిషనరేట్’ ధర్నాను జయప్రదం చేయాలని ఐఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దాసు పిలుపునిచ్చారు. బుధవారం ఆర్మూర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.