TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని ఆచరణలో చూపిస్తున్నామని చెప్పారు. రాబోయే మూడు సంవత్సరాలలో పట్టణ ప్రాంతాల్లోని ప్రతీ వార్డులో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో రెండో విడత ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.